తెలంగాణ

ప్రజలను మభ్యపెట్టేందుకే జిల్లాల విభజన : విహెచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 23: ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రజలను మభ్యపెట్టేందుకే తెరాస సర్కారు జిల్లాల విభజన చేపట్టిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు ఆరోపించారు. ఢిల్లీలో ఆదివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, తెరాస సర్కారు ఒక వైపు నిధులు లేవంటూనే మరోవైపు కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిందని, ఆ జిల్లాల్లో వౌలిక వసతుల కల్పనకు నిధులు ఎక్కడ నుంచి తీసుకొస్తారన్న దానిపై ముఖ్యమంత్రి కెసిఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్ణయాలపై ప్రజలు తిరగబడే రోజులు త్వరలోనే వస్తాయని విహెచ్ జోస్యం చెప్పారు. కెసిఆర్ ప్రభుత్వం వెంటనే విద్యార్థులకు ఫీజు రీ ఇంబర్స్‌మెంట్ చెల్లించాలన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టి ఇస్తామని మభ్యపెట్టి గ్రేటర్ ఎన్నికల్లో లబ్ధి పొందిన తెరాస తీరా ఆ హామీని నెరవేర్చకుండా ప్రజలను మోసగించిందని ఆయన నిప్పులు చెరిగారు.