తెలంగాణ

విద్యుదాఘాతంతో ప్రభాస్ అభిమాని దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, అక్టోబర్ 23: సినీ హీరో ప్రభాస్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఫ్లెక్సీని ఏర్పాటు చేస్తున్న క్రమంలో అతని అభిమాని ఒకరు విద్యుదా ఘాతానికి గురై మృతి చెందిన సంఘటన ఆదివారం నిజామాబాద్‌లో జరిగింది. ద్వారకానగర్‌కు చెందిన ప్రశాంత్(17) ఓ ప్రైవేట్ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు. సినీ హీరో ప్రభాస్ వీరాభిమాని అయిన ప్రశాంత్ అతని పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫ్లెక్సీలను తయారు చేయించాడు. తన అభిమాన హీరో జన్మదినం కావడంతో ఆదివారం తెల్లవారుజామునే నిద్ర లేచి, ఉదయం 6గంటల ప్రాంతంలో హైదరాబాద్ రోడ్‌లోని దేవీ థియేటర్ చౌరస్తా వద్దకు చేరుకున్నాడు. అందరికీ కనిపించేవిధంగా ఫ్లెక్సీని ఏర్పాటు చేయాలనే ఆరాటంతో రోడ్డు పక్కన ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ గద్దె పైకి ఎక్కాడు. ఫ్లెక్సీని కడుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు ట్రాన్స్‌ఫార్మర్‌కు తగిలి విద్యుదాఘాతానికి గురై ప్రశాంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల ద్వారా ఈ సమాచారం తెలుసుకున్న కుటుంబీకులు పరుగుపరుగున సంఘటనా స్థలానికి చేరుకుని శవమై పడి ఉన్న ప్రశాంత్‌ను చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్ ఎస్‌ఐ తెలిపారు.

చిత్రం.. మృతుడు ప్రశాంత్