తెలంగాణ

ప్రేమించి, పెళ్లాడి.. ప్రాణం తీశాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, అక్టోబర్ 23: ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న యువకుడు పెళ్లేయిన రెండు నెలలకే భార్యను హతమార్చాడు. ఈ సంఘటన స్థానికంగా విషాదం నింపింది. మహారాష్టల్రోని ఔరాంగబాద్‌లో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సూర్యాపేట పట్టణంలోని శ్రీశ్రీనగర్‌కు చెందిన గంపల లాజర్ సుజాత దంపతులకు ఐదుగురు కుమార్తెలు. వృత్తిరీత్యా మెకానిక్ అయిన లాజర్ నిత్యం కష్టపడి పనిచేస్తూ తన బిడ్డలను ఉన్నత చదువులు చదివించాడు. మూడవ కుమార్తె ప్రవళిక (26)ను ఎం.్ఫర్మసీ వరకు చదివించాడు. చివ్వెంల మండల పరిధిలోని కుడకుడ గ్రామానికి చెందిన పేరం జార్జి విమళ దంపతుల కుమారుడు రాంమనోహర్, ప్రవళిక గత కొనే్నళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరు తమ ప్రేమ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి ఇరు కుటుంబాల వారిని ఒప్పించి గత ఆగస్టు 21వ తేదీన వివాహం చేసుకున్నారు. ఔరంగబాద్‌లోని ఐసిఐసి బ్యాంక్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా రాంమనోహర్ ఉద్యోగం చేస్తుండడంతో మంచి ఉద్యోగమని భావించి లాజర్ దంపతులు పెళ్లికి అంగీకరించారు. వివాహం జరిగిన తర్వాత 20 రోజుల క్రితమే ప్రవళిక ఔరంగబాద్‌లో ఉన్న భర్త వద్దకు కాపురానికి వెళ్లింది. ఈ నెల 21న ప్రవళిక ఆత్మహత్యాయత్నం చేసిందని రాంమనోహర్ ఆమె తండ్రి లాజర్‌కు ఫోన్ చేశాడు. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు అక్కడికి వెళ్లే సరికే ప్రవళిక మృతి చెందింది. మృతురాలి వంటిపై గాయాలు ఉండడంతో అదనపు కట్నం కోసం అల్లుడే తమ కుమార్తెను హతమార్చాడని లాజర్ ఔరంగబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు అక్కడి పోలీసులు కేసునమోదు చేసుకొని నిందితుడు రాంమనోహర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రవళిక మృతదేహాన్ని ఆదివారం పట్టణానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. అదనపు కట్నం కోసమే రాంమనోహర్ తమ కుమార్తెను చంపి ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం చేశాడని లాజర్ దంపతులు ఆరోపించారు. ప్రేమ పేరుతో తమ కుమార్తెను బలిగొన్న రాంమనోహర్‌ను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. పెళ్లైన రెండునెలలకే ప్రవళిక మృతి చెందిన విషయం తెలుసుకున్న స్థానికులు మృతదేహాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కంటనీరు పెట్టారు.

చిత్రం.. భర్త చేతిలో హతమైన ప్రవళిక మృతదేహం