తెలంగాణ

నన్ను నడిపించేది రైతులే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, అక్టోబర్ 25: వాస్తవ దృక్పథంతో ఆలోచిస్తే అందరికీ ప్రయోజనంగా ఉంటుందని, తనపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల్లో ఎంతమాత్రం వాస్తవం లేదని తెలంగాణ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఖండించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రైతులు సాగు చేసిన పంటలన్నీ చిన్నాభిన్నంగా మారాయని, అధికారుల నిర్లక్ష్యం వల్ల పంటలకు పెను శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేసారు. మంగళవారం సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట మండలం పొట్టిపల్లి, ఏటిగడ్డసంగం, మునిపల్లి మండలం మన్‌సాన్‌పల్లి, తాటిపల్లి, మల్‌రెడ్డిపేట, రాయికోడ్ మండలం సింగితం, న్యాల్‌కల్ మండలం హద్నూర గ్రామాల్లో పంట నష్టపోయిన రైతులను పరామర్శించి, పంటల స్థితిగతులను పరిశీలించారు.
ఈ సందర్భంగా సదాశివపేట మండలంలో ఆయన మాట్లాడుతూ సింగూర్ ప్రాజెక్టులోకి వచ్చిన వరద నీటిని నిలిపివేయడం వల్ల ఎగువన రైతులు సాగు చేసిన పంటలు నీట మునిగాయన్నారు. ఈ విషయంలో అధికారులు ఆలోచించివుంటే ఇంత నష్టం జరిగేది కాదన్నారు. సింగూర్ ప్రాజెక్టులోని నీటిని ఈ ప్రాంతానికి చెందిన రైతులకు సాగుకు, ప్రజల తాగునీటి అవసరాలు తీర్చాలన్నారు. ప్రజాప్రయోజనాల కోసం మానవతా దృక్పథంతో తాను పనిచేస్తున్నానని, తన వెనక ఎవరూ లేరని, రైతు ప్రయోజనాలే ఉన్నాయన్నారు. తాము చెప్పేవాటిలో మంచి, చెడులను గమనించాలని, వాస్తవాలను గుర్తించి ప్రజలకు మేలు చేయాలని కోరారు. తమలో ఏదైనా తెలియని తప్పు ఉంటే వెల్లడించాలని, సరిదిద్దుకునేందుకు సిద్ధమన్నారు. రాజకీయ చర్చలకు వేదిక కాకుండా, మాటలతో దాడులకు పాల్పడడం, దుమ్మెత్తిపోయడం వంటి పద్ధతులను మార్చుకోవాలని హితవు పలికారు. అలాంటప్పుడే అందరికీ ప్రయోజనం కలుగుతుందన్నారు. స్వరాష్ట్రం సాధించినా రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు కొనసాగడం దురదృష్టకరమన్నారు. నకిలీ విత్తనాలను అరికట్టాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నారు. పంట నష్టపరిహారాన్ని వెంటనే అందించి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రైతు క్షేమంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ప్రజాసమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతామని ఆయన అన్నారు. పంట నష్టపోయిన రైతులు అధైర్యపడవద్దని, ఆత్మహత్యలతో సమస్యలకు పరిష్కారం లభించదని సూచించారు. కోదండరాం వెంట మంజీర రైతు సమాఖ్య జిల్లా అధ్యక్షులు తుమ్మలపల్లి ఫృథ్వీరాజ్, బిసి సంఘం నాయకుడు బీరయ్య యాదవ్, జెఎసి నాయకుడు అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. భారీ వర్షాలకు రంగు మారిన మొక్కజొన్న కంకులను
పరిశీలిస్తున్న జెఎసి చైర్మన్ కోదండరాం