తెలంగాణ

బోగస్ సర్వేలు కట్టిపెట్టి పాలనపై దృష్టిపెట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 29: బోగస్ సర్వేలు కట్టిపెట్టి, పాలనపై దృష్టి పెట్టాలని టి.టిడిపి అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును డిమాండ్ చేశారు. ఒక సర్వేలో ముఖ్యమంత్రి కెసిఆర్‌కు దేశంలోనే నెంబర్-1 స్థానం దక్కిందనడం శుద్ధ అబద్ధమని ఆయన శనివారం విలేఖరుల సమావేశంలో అన్నారు. రెండున్నర సంవత్సరాల టిఆర్‌ఎస్ పాలనపై, ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రజాభిప్రాయం నిర్వహిస్తే కెసిఆర్ పాలన అసలు నిజం బయటపడుతుందని అన్నారు. ప్రభుత్వ నిర్ణయాలపై హైకోర్టు 19 సార్లు మొట్టికాయలు వేయించుకున్నందుకా?, సచివాలయంలో అడుగు పెట్టకుండా ఫామ్ హౌస్ నుంచే పరిపాలన సాగిస్తున్నందుకా?, ఐదుసార్లు ఎంసెట్ పరీక్ష రాయించి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడినందుకా?, ఫీజు రీఇంబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ బకాయిలు, రైతు రుణ, ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లించనందుకా?, డబుల్ బెడ్‌రూం ఇళ్లు, దళితులు, గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇవ్వనందుకా? ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించనందుకా? దేశంలోనే నెంబర్ వన్‌గా సిఎం కెసిఆర్ నిలుస్తారని నర్సిరెడ్డి ప్రశ్నించారు.