తెలంగాణ

పటేల్ లేనిదే తెలంగాణ లేదు.. కెసిఆర్ సిఎం అయ్యేవారు కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 31: సర్దార్ వల్లభాయి పటేల్ లేకుంటే తెలంగాణ లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ పేర్కొన్నారు. తెలంగాణ లేకుంటే సిఎంగా కె చంద్రశేఖరరావుకు అవకాశం వచ్చేది కాదని వ్యాఖ్యానించారు. రాష్ట్రీయ ఏక్తా దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించాలని కేంద్రం సూచించినా, టిఆర్‌ఎస్ ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదని లక్ష్మణ్ పేర్కొన్నారు.
సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా అసెంబ్లీ సమీపంలోని సర్దార్ పటేల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతానికి 2948 సెప్టెంబర్ 17న స్వాతంత్య్రం లభించడానికి సర్దార్ పటేల్ శక్తియుక్తులే కారణమని గుర్తుచేశారు. అన్ని పార్టీలూ పటేల్ జయంతిని నిర్వహిస్తున్నా, టిఆర్‌ఎస్‌కు మాత్రం పట్టింపు లేదని అన్నారు. ఓట్ల రాజకీయాలకు స్వాతంత్య్ర ఉత్సవాలు జరపకపోవడం తెలంగాణకు చేస్తున్న ద్రోహమేనని అంటూ, ఆనాటి పోరాట యోధులను అవమానపర్చడమేనని ఆయన విమర్శించారు. కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ సర్దార్ పటేల్ అకుంటిత దీక్షతో దేశంలోని 500కుపైగా సంస్థానాలను విలీనం చేశారని, ఆయన సరైన చర్య తీసుకోకపోయుంటే నిజాం నవాబు లొంగిపోయేవాడు కాదని , ఇపుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యేది కాదని అన్నారు. బిజెపి జాతీయ ప్రధానకార్యదర్శి పి మురళీధరరావు మాట్లాడుతూ దేశ ఐక్యత, అఖండతకు పటేల్ చేసిన సాహసోపేతమైన చర్య అందరూ గుర్తుంచుకోవాలని అన్నారు. జి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ గొప్ప రాజనీతిజ్ఞుడు, పరిపాలనాదక్షుడైన సర్దార్ పటేల్ బాటలో పయనించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి పక్ష నేత ఎన్ రాంచందర్‌రావు, జాతీయ కార్యవర్గ సభ్యుడు పేరాల శేఖరరావు, మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటరమణి, ప్రధానకార్యదర్ళి చింతా సాంబమూర్తి, రాష్టక్రార్యదర్శి బి శ్యాంసుందర్‌గౌడ్, నగర అధ్యక్షుడు బి వెంకటరెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు.