ఆంధ్రప్రదేశ్‌

ఉగ్రవాదులకు స్వర్గ్ధామం కాంగ్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 2: ఉగ్రవాదులకు కాంగ్రెస్ పార్టీ స్వర్గ్ధామంగా మారిందని బిజెపి జాతీయ కార్యదర్శి, ఎపి వ్యవహారాల ఇన్‌చార్జి సిద్ధార్థనాథ్ సింగ్ విమర్శించారు. ఉగ్రవాదులను ఆ పార్టీ వెనకేసుకొస్తోందని ఆరోపించారు. విజయవాడలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ స్వర్గ్ధామంలా భావించి కాంగ్రెస్ పార్టీలో ఉగ్రవాదులు చేరుతున్నారన్నారు. బాట్లాహౌస్ ఘటనలో కాంగ్రెస్, ఇతర పక్షాల నేతలు ఆజంగఢ్ వెళ్లి ఉగ్రవాదులపై సానుభూతి వ్యక్తం చేశారన్నారు. ఉరీ ఘటన తరువాత కూడా రాహుల్ గాంధీ, తదితరులు దాడికి సంబంధించి రుజువులు అడుగుతున్నారన్నారు. లక్షిత దాడికి రుజువులు అడగటం ద్వారా పాకిస్తాన్‌కు, ఉగ్రవాదులకు మద్దతు పలుకుతున్నారని కాంగ్రెస్‌పై దుమ్మెత్తిపోశారు. భోపాల్‌లో సిమీ కార్యకర్తల ఎన్‌కౌంటర్ వ్యవహారంలో కూడా ఉగ్రవాదుల కాల్పులకు చనిపోయిన గార్డ్ గురించి కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ పట్టించుకోవడం లేదన్నారు. దీన్ని బూటకపు ఎన్‌కౌంటర్‌గా ఆరోపిస్తున్నారని, దీనిద్వారా సిమీ ఉగ్రవాదుల వైపు ఉన్నట్లు కాంగ్రెస్ తీరు తెలియచేస్తోందన్నారు. ఈ ఘటనల ద్వారా ఉగ్రవాదులకు, వారి సానుభూతిపరులకు సురక్షిత ప్రదేశంగా కాంగ్రెస్ తయారైందని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు ఎప్పుడూ బెనిఫిట్ ఆఫ్ డౌట్‌ను ఉగ్రవాదులకు వర్తించేలా చూస్తారని, ఆర్మీ, పోలీస్‌లకు ఇవ్వరా అని ఆయన ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇటీవల చోటుచేసుకున్న ఉగ్ర చర్యలను మతపరమైన ఉగ్రవాదంగా ప్రచారం చేస్తున్నారా? అని ప్రశ్నించారు. ఇటీవల ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లో చనిపోయినవారిలో 11 మందిని చిత్రహింసలకు గురిచేసి చంపారని మావోయిస్టు నేత జగన్ ఆరోపించారని గుర్తుచేశారు. అందులో చనిపోయినవారి ఇంటిపేర్లు ముస్లింలవి కాకపోవడంతో కాంగ్రెస్ ప్రశ్నించడం లేదన్నారు. ఉగ్రవాదాన్ని మతపరమైన వ్యవహారంగా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. మీడియా, సామాజిక మాధ్యమాలను వీలైనంత ఎక్కువగా ఉపయోగించి ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. పార్టీ కార్యకలాపాలను 19 విభాగాలు చేసి 10 ప్రాజెక్టులను చేపడుతున్నామన్నారు. అన్ని జిల్లాల్లో సొంతంగా పార్టీ కార్యాలయాలను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం, అసెంబ్లీ సెగ్మెంట్లకు మీడియా, సొషల్ మీడియాను వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖ ఎంపీ కె హరిబాబు, బిజెపి శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు.

పని చేసేవారికే పట్టం

ఖ టిడిపి కార్యకర్తలకు చంద్రబాబు స్పష్టీకరణ

ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, నవంబర్ 2: తెలుగుదేశం కార్యకర్తల సంక్షేమం కోసం కార్యాచరణ రూపొందించి అమలుచేస్తామని పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ నెల 1 నుంచి ప్రారంభమైన జనచైతన్య యాత్రలు, 2016-18 తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలను బుధవారం ఆయన ఉండవల్లిలోని తన నివాసం నుంచి పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసే వారినే సభ్యులుగా చేర్చుకోవాలని సూచించారు. దేశంలో ఏ రాజకీయ పార్టీ చేపట్టని విధంగా కార్యకర్తల సంక్షేమం కోసం వినూత్న రీతిలో కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రజల కుటుంబ సంక్షేమానికి 15 సూత్రాలు ప్రకటించిన విధంగా కార్యకర్తల సంక్షేమానికి కూడా ప్రణాళిక రూపొందించాలన్నారు. ప్రతిరోజూ 9 గంటలకు జనచైతన్య యాత్రలు, సభ్యత్వ నమోదు కార్యక్రమంపై సమీక్ష సమావేశాలు నిర్వహిస్తామని వివరించారు.

నేడు విట్‌కు శంకుస్థాపన

ఆంధ్రభూమి బ్యూరో
గుంటూరు, నవంబర్ 2: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ప్రతిష్ఠాత్మక వెల్లూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (విట్) ఏర్పాటు కానుంది. వెలగపూడి సచివాలయానికి 5 కిలోమీటర్ల దూరంలో ఐనవోలు గ్రామం వద్ద 200 ఎకరాల్లో ఏర్పాటుకానున్న ఈ విద్యాసంస్థకు గురువారం ఉదయం 10.30 గంటలకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్య నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నారు. ముందుగా ఇంజనీరింగ్ కళాశాల నెలకొల్పాలని సంస్థ యాజమాన్యం నిర్ణయించింది. తరువాత ఫార్మసీ, ఎంబిఎ, తదితర కోర్సులు ప్రవేశపెడతారు. వచ్చే ఏడాది నుంచే ఇంజనీరింగ్ అడ్మిషన్లు నిర్వహించాలని ప్రభుత్వం సూచించింది. ఈమేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వెలగపూడి నుంచి ఐనవోలు గ్రామం వరకు ఏర్పాట్లను ప్రత్యేక అధికారులు పర్యవేక్షిస్తున్నారు. శంకుస్థాపన ఏర్పాట్లపై సీఆర్డీఏ ఉప కమిషనర్ చెన్నకేశవులు, గుంటూరు డీఆర్వో కె నాగబాబు, జెసి వెంకటేశ్వర్లు పోలీసు, రెవెన్యూ అధికారులతో చర్చించారు. వివిధ కళాశాలలకు చెందిన 15వేల మంది విద్యార్థులను కార్యక్రమానికి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాగా ఇటీవల రాజధాని ప్రభుత్వ భవనాల శంకుస్థాపన సందర్భంగా భారీ వర్షం కురిసి అనూహ్యంగా ఇబ్బందులు ఎదురైన నేపథ్యంలో విట్ శంకుస్థాపన కార్యక్రమానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. పది సాధారణ సౌకర్య కేంద్రాలు ఏర్పాటు చేసి పదిమంది మునిసిపల్ కమిషనర్లను ప్రత్యేకాధికారులుగా నియమించారు.

భోపాల్ ఎన్‌కౌంటర్‌పై ఎన్‌ఐఏ విచారణ

ఏఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ డిమాండ్

ఆంధ్రభూమి బ్యూరో
తిరుపతి, నవంబర్ 2: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ సెంట్రల్ జైల్‌లో సిమీ తీవ్ర వాదులు తప్పించుకోవడం, ఆపై జరిగిన ఎన్‌కౌంటర్ ఘటనలపై నేషనల్ ఇనె్వస్టిగేటివ్ ఏజెన్సీ ద్వారా న్యాయ వ్యవస్థ పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్ సింగ్ డిమాండ్ చేశారు. బుధవారం శ్రీవారిని దర్శించుకున్న ఆయన తిరుపతి మాజీ ఎంపి చింతామోహన్ స్వగృహంలోనూ, అటు తరువాత ప్రెస్‌క్లబ్‌లో మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. భోపాల్ సెంట్రల్ జైల్‌లో ఉగ్రవాదులు తప్పించుకోవడం దగ్గరనుంచి వారిని హతమార్చేంత వరకు అనేక అనుమానాలు తలెత్తుతున్నాయన్నారు. సెంట్రల్ జైలులో ఉన్న 8 మంది ఉగ్రవాదులు ఒక బ్రెష్ సహకారంతో డూప్లికేట్ తాళాలు తయారుచేసి తప్పించుకున్నారని సాక్షాత్తూ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అటు తరువాత వారిని ఎన్‌కౌంటర్‌చేసిన పోలీసులు వారి వద్ద మారణాయుధాలు ఉన్నట్లు చెప్పుకొచ్చారన్నారు. జైలు నుంచి తప్పించుకున్న వారి నుంచి ఆయుధాలు ఎలా వచ్చాయో వారే చెప్పాలన్నారు. తీవ్రవాదులు పారిపోవడంపై విచారణ జరిపిస్తామన్న ప్రభుత్వం ఎన్‌కౌంటర్‌పై మాత్రం విచారణ జరిపించడానికి వెనుకాడటంలో ఉన్న ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. 2014వ సంవత్సరంలో జైల్లో సిబ్బంది కొరత ఉందని అప్పటి జైలు అధికారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటికీ పోస్టులు భర్తీచేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోందన్నారు. ఈ క్రమంలో వీటన్నిటిపై నిజానిజాలు తేలాలంటే కోర్టు ఆధ్వర్యంలో ఎన్‌ఐఎ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మాలేగావ్, హైదారాబాద్‌లో మక్కామసీదు, గుజరాత్‌లో బాంబుపేళుళ్లు, తంజోత ఎక్స్‌ప్రెస్ బాంబు పేళుళ్ల వెనక ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలున్నారని, తీవ్ర ఆరోపణలు చేశారు. అందుకే ఈ సంఘటనపై విచారణ జరిపించిన దాఖలాలు లేవన్నారు. పటాన్ కోట్, ఊరి ఘటనలలో కేంద్ర నిఘా వ్యవస్థ ఎందుకు వైఫల్యం చెందిందోప్రభుత్వం దృష్టి పెట్టలేదని ప్రశ్నించారు.
కమీషన్ల కోసమే బాబు విదేశీ మోజు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి విదేశీయ నిర్మాణ సంస్థల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మోజు పెంచుకోవడం వెనుక ఉన్న రహస్యం కమిషన్ల కోసమేనని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి యుపి ఎ ప్రభుత్వం రూ.16వేల కోట్లరూపాయలతో పనులు ప్రారంభించామని, రూ.5వేలకోట్లు ఖర్చుకూడా చేశామన్నారు. కమీషన్లకోసం కక్కుర్తిపడి చంద్రబాబు సర్కార్ ప్రాజెక్టు వ్యయాన్ని భారీగాపెంచేస్తున్నారన్నారు.మాజీ ఎంపి చింతామోహన్, మాజీ టిటిడి చైర్మన్ కనుమూరి బాపిరాజు పాల్గొన్నారు.

నేడు కాశ్మీర్‌లో నెలకొని ఉన్న దురదృష్ట పరిస్థితులకుప్రధాన కారణం పిడిపి, బిజెపిలు సంకీర్ణ ప్రభుత్వాలేనన్నారు. రెండు భిన్న సిద్దాంతాలు కలిగిన పార్టీల మధ్య పొత్తు ఏర్పడినపుడే తాము ఇలాంటి అనుమానాలను వ్యక్తం చేశామని గుర్తుచేశారు. ప్రపంచం కోరుకుంటున్నది శాంతినే తప్ప యుద్దాన్ని కాదన్నారు. ఆ దిశగా మోదీ శాంతి వాతావరణాన్ని నెలకొల్పడంపై దృష్టి సారించాలని హితవుపలికారు. ప్రజలులేని కాశ్మీర్ కావాలో,ప్రజలున్న కాశ్మీర్ కావాలో తేల్చుకోవాలని తాను మోదీనికోరుతున్నానన్నారు.