తెలంగాణ

స్టీల్‌ప్లాంట్ సర్వేను అడ్డుకున్న గిరిజనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మఠంపల్లి, నవంబర్ 3: నల్లగొండ జిల్లా మఠంపల్లి మండలంలోని గుర్రంపోడు తండా పునరావాస భూములలో స్టీల్‌ప్లాంట్‌కు సంబంధించి హద్దుల ఏర్పాటు కోసం వచ్చిన రెవెన్యూ సర్వే అధికారులను గురువారం గిరిజనులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కొంత మేర ఉద్రిక్తత నెలకొంది. 540 సర్వే నెంబర్‌లో తమ భూములను ఎవరికీ విక్రయంచలేదని సర్వే సిబ్బందికి గిరిజనులు స్పష్టం చేశారు. దీనిపై సర్వే నిర్వహించేందుకు వచ్చిన అధికారులతో వాగ్వాదానికి దిగగా ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులు వారితో చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. దీంతో రెవెన్యూ అధికారులు వెనుదిరిగారు. కార్యక్రమంలో ఆర్‌ఐ శైలజ, విఆర్‌ఓ వెంకట్‌రాంరెడ్డి, ఎస్‌ఐలు జగన్, గోపి, సర్వేయర్ సురేశ్, శ్రీను పాల్గొన్నారు.