తెలంగాణ

ప్రేమించ లేదని యువతి హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తుంగతుర్తి, నవంబర్ 4: తనను ప్రేమించి పెండ్లి చేసుకోవాలని యువతిపై వత్తిడి తెచ్చిన యువకుడు ఆమెపై కిరోసిన్‌పోసి నిప్పు అంటించడంతో చికిత్స పొందుతూ మృతిచెందిన సంఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలకేంద్రంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబందించి ఎస్‌ఐ యాదేంద్ర తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలకేంద్రానికి చెందిన బొంకూరి సోమయ్య, సోమమ్మల కుమార్తె బొంకూరి శోభారాణి (19) ఇంట్లోవుండగా ఇదే గ్రామానికి చెందిన కత్తుల నవీన్ అనే యువకుడు ఇంటికి వచ్చి తనను ప్రేమించాలని, పెళ్ళి చేసుకోవాలని వత్తిడి తెచ్చాడు. అందుకు శోభారాణి అంగీకరించకపోవడంతో ఆమెపై నవీన్ కిరోసిన్ పోసి నిప్పు అంటించినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఈ సంఘటన గత నెల 25న జరిగిందని తీవ్రంగా గాయపడిన యువతిని తొలుత మండలకేంద్రంలోని ప్రైవేట్ ఆసుపత్రికి, ఆ తర్వాత అక్కడి నుండి సూర్యాపేట ఆసుపత్రికి తరలించగా వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించామని, అక్కడ చికిత్స పొందుతూ ఆమె గురువారం మృతిచెందిందని తెలిపారు. శోభారాణి ఇచ్చిన వాగ్మూలంతో పాటు మృతురాలి తల్లితండ్రుల ఫిర్యాదు మేరకు నవీన్‌పై హత్యానేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ వివరించారు.