ఆంధ్రప్రదేశ్‌

కార్పొరేట్‌లతో కుమ్మక్కు -పిసిసి అధ్యక్షుడు రఘువీరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు అర్బన్, నవంబర్ 9:కార్పొరేట్ శక్తులతో కేంద్రప్రభుత్వం కుమ్మకై ఐదువందలు, వెయ్యిరూపాయల నోట్లను రద్దుచేసిందని పిసిసి అధ్యక్షుడు ఎన్ రఘవీరారెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం ఒంగోలులో జిల్లాకాంగ్రెస్‌పార్టీకార్యాలయంలో ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చాక నల్లధనాన్ని వెలికితీస్తామని పదేపదే మాట్లాడిన మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ విషయాన్ని విస్మరించారన్నారు. ఇప్పుడు కార్పొరేట్‌శక్తులకు తలొంచి వారి చెప్పిన విధానానే్న అమలుచేసి నోట్లను రద్దుచేశారని ఆరోపించారు. కార్పొరేట్‌శక్తులు దోచుకున్న డబ్బుతో బంగారం, భూములను కొనుగొలు చేసిన తరువాతనే ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. నోట్ల రద్దును తమపార్టీ పూర్తిగా స్వాగతిస్తుందన్నారు.