తెలంగాణ

లారీ, కారు ఢీ: ముగ్గురు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిర్యాల అర్బన్, నవంబర్ 17: మంచిర్యాల మండలం హాజీపూర్ పోలీసుస్టేషన్ సమీపంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన లారీ, కారు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయ. ఇందుకు సంబంధించి మంచిర్యాల ఇన్‌చార్జి ఎసిపి రమణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం లక్సెట్టిపేటవైపు వెళుతున్న కారు ముందు వెళుతున్న లారీని ఓవర్‌టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి ముందుగా వెళుతున్న మరో లారీని వెనుక వైపు నుంచి వేగంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో డ్రైవర్ చంద్రశేఖర్ (31)తోపాటు గంగాధర్ (34), తేజశ్వి(31) అక్కడికక్కడే మృతిచెందారు. సాయితేజకు తీవ్రగాయాలు కావడంతో మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తూ మెరుగైన వైద్యంకోసం హైదరాబాద్‌కు తరలించారు. మృతుల్లో గంగాధర్, చంద్రశేఖర్‌లది వైజాగ్ కాగా, తేజశ్వి, సాయితేజలు హైదరాబాద్ వాసులు.