తెలంగాణ

విలేఖరిని ఫోన్‌లో బెదిరించిన వ్యక్తిపై ఫిర్యాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 21: ఓ విలేకరిని ఫోన్‌లో బెదిరించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బోడుప్పల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక విలేకరులు సోమవారం మేడిపల్లి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇటీవల ఓ దిన పత్రికలో (ఆంధ్రభూమి కాదు) కబ్జా కేసులో దుండగుల అరెస్టు అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. ఈ పత్రికలో పని చేసే విలేకరి జె.శ్రీనివాస్ ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు యాదాద్రి జిల్లా పడమటి సోమారం శివాలయంలో పూజలో పాల్గొన్నారు. ఆ సమయంలో తన వద్ద ఉన్న సెల్‌ఫోన్ మోగ గా పూజలో ఉన్నందున స్పందించలేదు. పూజ అనంతరం మరోసారి 8106694074 అనే ఫోన్ నుంచి ఓ వ్యక్తి ఫోన్ చేశారు. తాను మేడి పాపయ్యను అంటూ నోటితో చెప్పలేని పదజాలంతో నీ అంతు చూస్తానని బెదిరించారని, అతని నుంచి తనకు ప్రాణ హాని ఉందని, అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.