తెలంగాణ

దేశద్రోహులకే బిజెపి వ్యతిరేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 3: భారతీయ జనతా పార్టీ దేశద్రోహులకే వ్యతిరేకమని, ముస్లింలకు కాదని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. బిజెపి రాష్టక్రార్యాలయంలో మైనార్టీ మోర్చ అధ్యక్షుడిగా అఫ్సర్ పాషా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ముస్లింల ట్రిపుల్ తలాఖ్ , రిజర్వేషన్ల విషయంలో బిజెపికి స్పష్టమైన వైఖరి ఉందని అన్నారు. కేంద్రంలో ప్రధాని నరేంద్రమోదీ దేశంలో పేదరికాన్ని రూపుమాపేందుకు అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని అన్నారు. ముస్లిం మైనార్టీలు అందులో భాగస్వామ్యులై లబ్ది పొందాలని అన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ ముస్లింలను ఓటు బ్యాంకుగా వాడుకుందని, వారి అభివృద్ధి, సంక్షేమాలను పట్టించుకోలేదని అన్నారు. మైనార్టీల్లో పేదరికం పోలేదని అన్నారు. ఏ మతానికి చెందిన వారికైనా అన్యాయం జరగకూడదనేది బిజెపి విధానమని, కాంగ్రెస్ లాంటి పార్టీలు చెబుతున్న మైనార్టీల రిజర్వేషన్లు చట్టసమ్మతం కావని, ఆర్ధిక జీవన స్థితి గతుల ఆధారంగానే రిజర్వేషన్లు ఉండాలని సుప్రీంకోర్టు పేర్కొందన్నారు.