తెలంగాణ

రెండు లక్షల క్రైస్తవ కుటుంబాలకు 18న దుస్తుల పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 12: క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని రెండు లక్షల పేద క్రైస్తవ కుటుంబాలకు దుస్తులు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ నగరంలో లక్ష కుటుంబాలకు, జిల్లాల్లో మరో లక్ష కుటుంబాలకు దుస్తులు పంపిణీ చేయాలని నిర్ణయించింది. శాసనసభ సమావేశాల నేపథ్యంలో ఈ నెల 18న ఆదివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. అలాగే ప్రభుత్వం అధికారికంగా ఈ నెల 20న ఎల్‌బి స్టేడియంలో అధికారికంగా నిర్వహించే క్రిస్మస్ విందుకు ముఖ్యమంత్రి హాజరుకానున్నట్టు పేర్కొన్నారు.