తెలంగాణ

సిరిసిల్లకు మిడ్ మానేరు నీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, డిసెంబర్ 12: మిడ్ మానేరు నుండి త్వరలోనే సిరిసిల్ల పట్టణానికి తాగు నీరు అందిస్తామని, ఇందు కోసం రూ.60 కోట్లతో మిషన్ భగీరథ పనులు సాగుతున్నాయని రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు వెల్లడించారు. సోమవారం పట్టణంలోని వివిధ అభివృద్ది పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్థానిక వెంకట్రావునగర్‌లో జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ పట్టణంలోని ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్ ఇస్తామని, మిడ్ మానేరు నీరందేలోగా నల్లా కనెక్షన్లు పూర్తి చేయాలని అన్నారు. త్వరలోనే రింగ్ రోడ్డు పనులు చేపడుతున్నామని, త్వరలో సిరిసిల్ల-కామారెడ్డి, సిరిసిల్ల-సిద్దిపేట రోడ్లను విస్తరిస్తున్నామని, దీనికి ప్రజలు సహకరించాలన్నారు.

చిత్రాలు..సిరిసిల్ల సభలో ప్రసంగిస్తున్న మంత్రి కె.తారకరామారావు