తెలంగాణ

రాజేశ్వరరావుకు అంతిమ వీడ్కోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 13: మాజీ ప్రధాని పివి నరసింహారావు కుమారుడు పివి రాజేశ్వర రావు భౌతికకాయానికి మంగళవారం అంత్యక్రియలు జరిగాయి. రాజేశ్వరరావు సోమవారం యశోద ఆసుపత్రిలో కన్నుమూశారు. మంగళవారం జూబ్లీహిల్స్, విస్పర్‌వ్యాలీ, మహాప్రస్థానం స్మశాన వాటికలో ఆయన కుమారుడు రాఘవేంద్ర కాశ్యప్ అంత్యక్రియలు నిర్వహించారు. అంతకు ముందు ఆదర్శనగర్‌లోని పివి స్వగృహంలో రాజేశ్వరరావు భౌతికకాయాన్ని కాంగ్రెస్ కార్యాలయమైన గాంధీ భవన్‌కు పార్టీ నాయకులు, కార్యకర్తల సందర్శనార్థమై తీసుకెళ్ళారు. అక్కడ టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మాజీ ఎంపిలు పొన్నం ప్రభాకర్, అంజన్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు చిన్నారెడ్డి, వంశీచంద్ రెడ్డి తదితరులు పివి భౌతికకాయంపై పుష్పగుచ్చాలు ఉంచి నివాళి అర్పించారు. కిరణ్‌కుమార్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సిఎల్‌పి నేత కె. జానారెడ్డి ప్రభృతులు రాజేశ్వర రావు కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని తెలిపారు.

చిత్రాలు...మంగళవారం హైదరాబాద్‌లో పి.వి.రాజేశ్వరావు భౌతికకాయం వద్ద నివాళులర్పిస్తున్న పిసిసి నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్