తెలంగాణ

నగదు మార్పిడి చేస్తామంటూ మోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 15: హైదరాబాద్ నగరంలో నగదు మార్పిడి పేరుతో మోసానికి పాల్పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఫిల్మ్‌నగర్, బంజారాహిల్స్, రాజేంద్రనగర్, పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో నగదు మార్పిడి కేసులో దాదాపు 22 మంది అరెస్టయిన సంగతి తెలిసిందే. తాజాగా ఇలాంటి ఘటనే ఆజమాబాద్‌లో గురువారం చోటుచేసుకుంది. నగదు మారుస్తామంటూ ఓ ముఠా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మాదాపూర్‌కు చెందిన ఓ వ్యక్తిపై దాడికి పాల్పడింది. సదరు వ్యక్తి నుంచి ఆ ముఠా రూ. 61 లక్షలు లాక్కెళ్లింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన చిక్కడపల్లి పోలీసులు ముషీరాబాద్‌కు చెందిన ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 19 లక్షలు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందని, నిందితుల అరెస్టును త్వరలో వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.