తెలంగాణ

ఫీజు వేధింపులు.. విద్యార్థి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 5: ఇటీవల ఫీజుల వేధింపులతో బిటెక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మరువకముందే నగరంలో మరో చిన్నారి ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం కంచన్‌బాగ్‌లో చోటుచేసుకుంది. ప్రిన్సిపాల్ వేధింపులు భరించలేక తొమ్మిదో తరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కంచన్‌బాగ్ హఫీజ్ బాబానగర్‌లోని ఓ హైస్కూల్‌లో తొమ్మిదోతరగతి చదువుతోన్న మీర్జా సల్మాన్ బేగ్ ఆత్మహత్య చేసుకున్నాడు. రెండు నెలలుగా ఫీజు కట్టడం లేదంటూ ప్రిన్సిపాల్ వేధించడంతో మానసిక ఒత్తిడికి లోనై ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో కంచన్‌బాగ్‌లోని మీర్జా కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ విషయమై హైస్యూల్ ప్రిన్సిపాల్‌ను వివరణ కోరగా, తాను ఫీజు కట్టడం లేదని వేధించలేదని వివరించారు.