తెలంగాణ
నేటినుంచి ఫారెస్ట్ స్పోర్ట్స్ మీట్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
హైదరాబాద్, జనవరి 6: గచ్చిబౌలి స్టేడియంలో శనివారం నుంచి నాలుగు రోజుల పాటు జరుగనున్న ఆల్ ఇండియా ఫారెస్ట్ స్పోర్ట్స్ మీట్-2017ను ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు ప్రారంభించనున్నారు. అటవీశాఖ మంత్రి జోగు రామన్న శుక్రవారం సాయంత్రం శాసనసభలో ముఖ్యమంత్రి కెసిఆర్ను కలిసి స్పోర్ట్స్ మీట్ను ప్రారంభించాల్సిందిగా కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందిస్తూ 1992 తర్వాత తిరిగి 25 సంవత్సరాలకు ఆల్ ఇండియా ఫారెస్ట్ స్పోర్ట్స్ మీట్కు హైదరాబాద్ వేదిక కావడంతో ప్రారంభోత్సవానికి తప్పకుండా వస్తానని చెప్పారు. కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ, 29 రాష్ట్రాలకు చెందిన ఉద్యోగులు స్పోర్ట్స్ మీట్లో పాల్గొంటారని మంత్రి జోగురామన్న తెలిపారు.
సిఎంకు గంగపుత్రుల కృతజ్ఞతలు
చెరువులలో చేపల పెంపకం పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ కనబరుస్తున్న ఆసక్తి పట్ల గంగపుత్రుల సంఘం హర్షం వ్యక్తం చేసింది. గంగపుత్ర సంఘాలకు చెందిన ప్రతినిధులు శుక్రవారం శాసనసభకు వచ్చి ముఖ్యమంత్రిని కలిసి ఈ మేరకు కృతజ్ఞతలు తెలియజేశారు.