తెలంగాణ

నరుూం కేసులో వాస్తవ నివేదికను వెల్లడించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 5: కరడుగట్టిన నేరస్థుడు నరుూం కేసులో ఇప్పటికైనా వాస్తవాలతో కూడిన నివేదికను కోర్టుకు సమర్పించాలని సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డిజిపిలను డిమాండ్ చేశారు. నరుూం ఉదంతంపై సిబిఐ విచారణ చేయించాలని న్యాయస్థానంలో పిల్ వేశామని, అయితే సిట్ విచారణ సరిపోతుందని, సిబిఐ విచారణ అవసరం లేదంటూ పిల్‌ను డిస్మిస్ చేయాలని ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తాజాగా నరుూంతోపాటు విందులో పాల్గొన్న పోలీసు అధికారుల ఫోటోలు అన్ని పత్రికల్లో పతాక స్థాయిలో ప్రచురించబడ్డాయని తెలిపారు. దీన్నిబట్టి తాను వేసిన పిల్‌కు ఆధారాలున్నాయని స్పష్టమవుతున్నందున ఇప్పటికైనా ఎంతమందిని విచారించారు, ఎవరెవరిని విచారించారో తెలియజేస్తూ నివేదికను కోర్టుకు గానీ, తనకు గానీ అందజేయాలని కోరారు.