తెలంగాణ

నరుూం అనుచరులపై పిడి యాక్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 7: గ్యాంగ్‌స్టర్ నరుూముద్దీన్ అనుచరులపై రాచకొండ పోలీసులు పిడి యాక్టు పెట్టారు. గతంలోనే ఇద్దరిపై పిడి యాక్ట్ పెట్టిన తాము తాజాగా మంగళవారం మరో ఐదుగురు నరుూం అనుచరులపై పిడియాక్టు నమోదు చేసినట్లు రాచకొండ కమిషనర్ మహేశ్ ఎం భగవత్ తెలిపారు. భువనగిరికి చెందిన మహమ్మద్ అబ్దుల్ నాసిర్ (40), భువనగిరి ఆర్‌బినగర్‌కు చెందిన బచ్చు నాగరాజు (37), భువనగిరి సంజీవనగర్‌కు చెందిన కత్తుల జంగయ్య (37), భువనగిరిటౌన్‌కు చెందిన పులి నాగరాజు (23) భువనగిరి స్టేషన్ రోడ్డుకు చెందిన ఎస్ హరి (48)లు భూకబ్జాలు, హత్యలు, కిడ్నాప్, బెదిరింపుల కేసుల్లో నిందితులు. అబ్దుల్ నాసిర్‌పై వ్యాపారులను బెదిరించి వసూళ్లకు పాల్పడడం, కిడ్నాప్, ఆయుధాలతో బెదిరింపులు వంటి 16 కేసులు ఉన్నాయి. నాగరాజుపై బెదిరింపులు, కిడ్నాప్‌లకు సంబంధించి 9 కేసులు ఉన్నాయి. కత్తుల జంగయ్యపై 26, పులి నాగరాజుపై 9, హరిపై ఐదు కేసులు ఉన్నాయి. శాంతిభద్రతల దృష్ట్యా వీరిపై పిడి యాక్టు పెట్టి రిమాండ్‌కు తరలించినట్టు భగవత్ తెలిపారు.