తెలంగాణ

సుందిళ్ల బ్యారేజీ పరిధిలో 240 ఎకరాలను స్వాధీనం చేసుకోవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 7: పెద్దపల్లి జిల్లాలో గౌలివాడ గ్రామ పరిధిలో సుందిళ్ల బ్యారేజీ వల్ల ముంపునకు గురయ్యే 240 ఎకరాలను రైతుల నుంచి తీసుకోరాదని , రైతులను అక్కడి నుంచి తరలించరాదని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2013 భూసేకరణ చట్టం కింద భూమి సేకరణ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఈ భూములను స్వాధీనం చేసుకోరాదని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. గౌలివాడకు చెందిన పి ప్రవీణ రెడ్డి అనే రైతు దాఖలుచేసిన పిల్‌ను హైకోర్టు ధర్మాసనం విచారించి పై ఆదేశాలు ఇచ్చింది.