తెలంగాణ

ఒయు శతాబ్ది ఉత్సవాలకు విచ్చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 9: ఈ ఏడాది ఏప్రిల్‌లో జరుగనున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం శతాబ్ధి ఉత్సవాల్లో పాల్గొనాలని ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానిస్తూ బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ లేఖ రాశారు. జాతీయ స్థాయిలో పది విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా నిలిచిన ఉస్మానియా విశ్వవిద్యాలయం నూరేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జరుగుతున్న శతాబ్ధి ఉత్సవాలకు హాజరు కావాలని లక్ష్మణ్ ఆ లేఖలో కోరారు. ఎంతోమంది మేధావులు, ప్రముఖులు ఈ విశ్వవిద్యాలయం నుంచి ఉన్నత శిఖరాలకు వెళ్లారని, తాను కూడా జియోలజీలో పిహెచ్‌డిని పూర్తి చేసి ఒయు రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్‌కు ప్రధాన కార్యదర్శిగా పని చేశానని ఆ లేఖలో వివరించారు. అద్భుత వేడుకగా జరిగే శతాబ్ధి ఉత్సవాలకు హాజరు కావాలని లక్ష్మణ్ ప్రధాని మోదీని కోరారు.