తెలంగాణ

చట్టసభల్లో బిసిలకు 50శాతం రిజర్వేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ముషీరాబాద్, ఫిబ్రవరి 12: పార్లమెంటులో బిసి బిల్లు పెట్టడానికి త్వరలో ఢిల్లీలో అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నటు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రకటించారు. బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య నేతృత్వంలో బిసి సంఘాల నేతలు ఆదివారం బంజారాహిల్స్‌లోని వెంక య్య నివాసంలో ఆయనను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు బిసిల డిమాండ్ల గురించి ఆయనకు వివరించారు. అనంతరం కృష్ణయ్య మీడియాతో మాట్లాడుతూ బిసిల సమస్యలు, డిమాండ్ల పరిష్కారానికి వెంకయ్య నాయుడు సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. పార్లమెంటులో బిసి బిల్లు పెట్టి చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని వెంకయ్య నాయుడిని కోరినట్లు ఆయన తెలిపారు. బిసి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేశారు.