తెలంగాణ
ప్రేమజంట ఆత్మహత్య
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బొంరాస్పేట, ఫిబ్రవరి 13: కడదాక తోడుందామని బాసలు చేసుకున్నారు. కుటుంబీకులు ఒప్పుకోకపోవడంతో అది ఫలించలేదు.. వారి ప్రేమను విధి వక్రీకరించింది. ప్రేమ జంటను విడదీయాలని అమ్మాయికి మేన బావతో పెళ్లి కూడా చేశారు. దాంతో వారు మృత్యువును కౌగిలించుకున్నారు. తమ ఇష్టదైవమైన శ్రీకృష్ణస్వామి దేవాలయం పక్కనే గల కృష్ణగిరి గుట్టల్లో ప్రేమికులు సోమవారం తనువు చాలించారు. పిట్టెలగూడెం గ్రామానికి చెందిన వనే్నపల్లి అఖిల(16) అదే గ్రామానికి చెందిన గంగిశెట్టి మధు(23) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. విషయాన్ని గమనించిన అమ్మాయి కుటుంబ సభ్యులు ఇరువురిని వారించారు. తమ ప్రేమను ఎవరు అడ్డుకోలేరని తాము కలిసుండాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరు కలిసి ఎవరికీ చెప్పకుండా నిరుడు నవంబర్లో ఇంటినుంచి పారిపోయారు. నెల రోజుల పాటు బయటే ఉన్న వీరు గ్రామానికి చేరుకున్నారు. ఈలోపు తమ అమ్మాయిని కిడ్నాప్ చేశాడని కుటుంబ సభ్యులు మధుపై కేసు పెట్టారు. రిమాండ్లో ఉన్న మధు ఇటీవలే జైలు నుండి విడుదలయ్యాడు. ఇలాగే వదిలేస్తే తమ పరువుపోతుందని భావించిన కుటుంబ సభ్యులు అదే గ్రామంలోని అమ్మాయి మేనబావ మల్లేష్కు ఇచ్చి డిసెంబర్ 2న పెళ్లి జరిపించారు. కొంతకాలం గడిస్తే అంతా సర్దుకు పోతుందని కుటుంబ సభ్యులు భావించారు. కానీ ఆ ప్రేమికుల మధ్య ఉన్న ప్రేమ మాత్రం తగ్గలేదు. ఎలాగైన ఇంట్లోంచి పారిపోవటానికి సిద్ధమయ్యారు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం శనివారం తెల్లవారు జామున ఇంట్లోంచి బయట పడ్డారు. ఇంటి నుండి ద్విచక్ర వాహనం పై బయలుదేరిన ఇరువురు పోలేపల్లి గ్రామం మీదుగా దుద్యాల గ్రామ శివారులోని కృష్ణగిరికి చేరుకున్నారు. ఆదివారం దినమంతా అక్కడే గడిపిన ఇద్దరూ మళ్లీ గ్రామానికి వెళితే.. తమను బతుకనివ్వరని భయాందోళనకు గురయ్యారు. తమ వెంట తెచ్చుకున్న పురుగుల మందును కూల్డ్రింక్లో కలుపుకొని తాగారు. అపై కుటుంబ సభ్యులకు రాత్రి పది గంటలకు ఫోన్ద్వారా సమాచారం అందించారు. జీవితాంతం కలిసుండాలని భావించాం.. ఇక అది జరగదని అనుకున్నాం.. ఇద్దరం కలిసి చనిపోతున్నామంటూ కడసారి మాటలు చెప్పి తనువు చాలించారు.
చావులోనూ తోడుగా..
అఖిల, మధుల ప్రేమ చావులోనూ కనబడింది. కలకాలం తోడునీడగా ఉందామనుకున్న ఆ ప్రేమ జంట కడసారి సైతం తోడుగానే తనువుచాలించారు. కొద్దిసేపట్లో చనిపోతున్నామని తెలిసినా వారి ప్రేమ ఆప్యాయతలకు నిదర్శనంగా.. అఖిలను పెనవేసుకొని ప్రాణాలు వదిలినట్లు సంఘటన స్థలంలో పడివున్న మృతదేహలను బట్టి తెలుస్తోంది. తమ అనుబంధాన్ని ఎవరూ విడదీయలేరన్నట్టుగా పెనవేసుకొని ప్రాణాలు విడిచిన ఆ దృశ్యం పలువురిని కలచివేసింది. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ హన్మప్ప కుటుంబ సభ్యుల నుండి వివరాలు సేకరించారు. మృతుడి అన్న గంగిశెట్టి మహేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ హన్మప్ప తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించనున్నట్లు ఎస్ఐ తెలిపారు.
చిత్రం.. మృతి చెందిన ప్రేమ జంట