తెలంగాణ

సాహితీవేత్త యతిరాజులు కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 23: ప్రముఖ సాహితీవేత్త, అనువాదకుడు ఎజి యతిరాజులు (81) చిత్తూరు జిల్లా గ్రీమ్స్‌పేటలో కన్నుమూశారు. యతిరాజులు మృతిపట్ల సాహితీ స్రవంతి గౌరవాధ్యక్షుడు తెలకపల్లి రవి, అధ్యక్షుడు వొర ప్రసాద్ సంతాపం వ్యక్తం చేశారు. తమిళనాడు గుడియాత్తంలో చేనేత కుటుంబంలో 1935 ఆగస్టు 4న యతిరాజులు జన్మించారు. తెలుగు, తమిళం, హిందీ, ఆంగ్లభాషల్లో, ఆయా భాషల సాహిత్యంతోనూ వీరికి మంచి పరిచయం ఉందని వీరి మాతృభాష తెలుగు అని వారు చెప్పారు. రాహుల్ సాంకృత్యాయన్ హిందీ గ్రంథాల అనువాదాలకు కేంద్ర, తమిళనాడు ప్రభుత్వాల పురస్కారాలను యతిరాజులు అందుకున్నారు.