తెలంగాణ

కాంగ్రెస్ పార్టీ దొంగల ముఠా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 25: కాంగ్రెస్ పార్టీ ఒక దొంగల ముఠా అని ప్రజలకు ఆ పార్టీ సంగతి తెలుసు కాబట్టే తగిన బుద్ధి చెప్పారని, ఉద్యమ కాలంలో బి ఫారమ్‌ల కోసం , మంత్రి పదవుల కోసం కాంగ్రెస్ నాయకులు ఆంధ్ర నాయకుల ముందు మోకరిల్లారని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో శనివారం జరిగిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ప్రజలంతా తెలంగాణ కోసం ఉద్యమిస్తుంటే ఆంధ్ర నాయకులు ఇచ్చే బి ఫారాల కోసం, మంత్రి పదవుల కోసం మోకరిల్లిన తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ప్రాజెక్టులు అడ్డుకొంటున్నారని విమర్శించారు. ఆంధ్ర నాయకుల కింద పని చేసిన కాంగ్రెస్ నాయకుల్లో ఇంకా వైఖరి మారలేదని, అదే అలవాటుతో పని చేస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకొంటూ, ముఖ్యమంత్రిపైన, ప్రభుత్వంపైన అవాకులు చవాకులు పేలుతున్నారని విమర్శించారు.