తెలంగాణ

సింగరేణిలో కాంట్రాక్టు కార్మికుల పోరుబాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, మార్చి 14: సింగరేణి వ్యాప్తంగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు పోరుబాట పట్టారు. తెలంగాణ లోని ఆరు జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణి కాంట్రాక్టు కార్మికులు తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (జెఎసి) ఆధ్వర్యంలో బుధవారం నుంచి నిరవధిక సమ్మె చేయనున్నారు. 26 డిమాండ్లతో సింగరేణిలోని పలు విభాగాల్లో పనిచేస్తున్న సుమారు 26 వేలకుపైగా కార్మికులు సమ్మె చేయనుండడంతో కీలక విభాగాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి. కాంట్రాక్టు కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని, కోల్ ఇండియా తరహాలో వేతనాలు చెల్లించాలని, కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని కోరుతూ సింగరేణిలోని ఎక్స్‌ప్లోరేషన్, ఓపెన్‌కాస్ట్‌లు, భూగర్భ గనులు, సివిల్ కోల్ ట్రాన్స్‌పోర్ట్, సింగరేణి కార్యాలయ నిర్వహణలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు, రైల్వే సైడింగ్, గార్డెన్, నర్సరీ, సర్ఫేస్ మైనర్, కంటిన్యూషన్ మైనర్ వంటి విభాగాల్లో పనిచేసే కార్మికులు సమ్మెకు దిగుతుండటంతో సింగరేణిలోని కీలక విభాగాల్లో కార్యకలాపాలు స్తంభించిపోయే అవకాశముంది. సింగరేణిలోని ప్రధాన కార్మిక సంఘాలైన ఎఐటియుసి, ఐఎన్‌టియుసి, సిఐటియు, ఐఎఫ్‌టియు, హెచ్‌ఎంస్, బిఎంఎస్, ఐఎఫ్‌టియులు కలిసి జాయింట్ యాక్షన్‌గా ఏర్పడి సింగరేణి యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చాయి. సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమ్మె బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం చూపే అవకాశం అధికంగా ఉంది. ఈ నెల 31వ తేదీతో సింగరేణి యాజమాన్యం నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యంపై సమ్మె ప్రభావం చూపనుందని యాజమాన్యం భావించి సమ్మెను విరమింపచేసేందుకు సింగరేణి అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో సింగరేణిలో కార్మికుల సమ్మె అనివార్యంగా మారింది.
చర్చలకు రాని యాజమాన్యం
సమ్మెపై చర్చించేందుకు అసిస్టెంట్ లేబర్ కమిషనర్ (సెంట్రల్) లక్ష్మణ్, సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జెఎసి నాయకుల సమక్షంలో మంగళవారం జరిగిన చర్చలకు సింగరేణి యాజమాన్యం తరఫున అధికారులు హాజరుకాలేదు. ఎఎల్‌సి, కార్మిక సంఘాల నాయకులు చర్చల కోసం వేచి చూసినప్పటికీ ఫలితం లేకపోవటంతో సమ్మె కొనసాగిస్తామని జెఎసి నాయకులు హైద్రాబాద్‌లో ప్రకటించారు.