తెలంగాణ

24న యువమోర్చా చలో అసెంబ్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 21: బిజెపి యువమోర్చా ఆధ్వర్యంలో 24న చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్టు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ చెప్పారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, వ్యూహాత్మకంగా అసెంబ్లీకి చేరుకోవాలని ఆయన కార్యకర్తలకు సూచించారు. పార్టీ పదాధికారుల అత్యవసర సమావేశం మంగళవారం రాత్రి జరిగింది. ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని తెలిసినా ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెడతామని సిఎం చెబుతున్నారని దీనిని నిరసిస్తూ 24న చలో అసెంబ్లీ నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు.

చిత్రం.. మంగళవారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగిన పదాధికారుల సమావేశంలో ప్రసంగిస్తున్న బిజెపి నేత లక్ష్మణ్