తెలంగాణ
గీత కార్మికులకు పరిహారం పెంపు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 27 March 2017
హైదరాబాద్, మార్చి 26: గీత కార్మికులకు నష్టపరిహారం పెంచుతూ జీఓ జారీ చేశామని ఎక్సైజ్ మంత్రి టి. పద్మారావు తెలిపారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, చెట్టుగీసే పని సమయంలో గీతకార్మికుడు మరణిస్తే గతంలో రెండులక్షల రూపాయలు నష్టపరిహారంగా చెల్లించేవారమని, దీన్ని ఐదులక్షలకు పెంచామని తెలిపారు. అలాగే పాక్షికంగా గాయమైనవారికి గతంలో 10 వేల రూపాయల చెల్లించేవారమని, ఇప్పుడు దీన్ని 50 వేల రూపాయలకు పెంచామని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ గౌడసోదరులకు ఇచ్చిన హామీ మేరకు ఆదివారం జీఓ జారీ చేశామని మంత్రి వివరించారు.