తెలంగాణ

అలంపూర్ టు ఆదిలాబాద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయిజ, ఏప్రిల్ 2: తెలంగాణ రాష్ట్ర ప్రజా సమస్యలపై త్వరలోనే అలంపూర్ నుండి ఆదిలాబాద్ వరకు పాదయాత్ర చేపడుతున్నానంటూ తెలుగుదేశం పార్టీ వర్కిం గ్ ప్రెసిడెంట్, శాసనసభ పక్షనేత ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని జిల్లా అధ్యక్షు డు రాంచంద్రారెడ్డి స్వగృహంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. టిఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మరచిపోయిందని, దళితులకు భూములు, డబుల్‌బెడ్‌రూంల పథ కం, ఉద్యోగుల భద్రత, జర్నలిస్టుల భద్రత లాం టి హామీలను మభ్యపెడుతూ కాలం గడుపుతుందన్నారు. కుటుంబ పాలన తో కెసిఆర్ రాష్ట్రాన్ని నడుపుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలు తెలుసుకొని పోరాటం చేస్తానన్నా రు. తెలంగాణలో రైతు ఆత్మహత్య లు లేకుండా బంగారు తెలంగాణ చేస్తానన్న కెసిఆర్ ఈ రోజు దేశంలోనే రైతు ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉందన్నారు. ఇప్పటి వరకు 3 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. బడ్జెట్ సమావేశంలో రుణమాఫీ చేయకుండా రైతులను నట్టేట ముంచుతున్నారని విమర్శించారు.

చిత్రం..రేవంత్‌రెడ్డికి నాగలిని బహూకరిస్తున్న టిడిపి నాయకులు