తెలంగాణ

మాది మిషన్ 2019

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 4: వచ్చే 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా మిషన్ 2019ని ఖరారు చేస్తున్నట్లు టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఇక జనంలోకి కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు వెళ్లి కెసిఆర్ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రచారాన్ని ఉధృతం చేస్తామన్నారు. మంగళవారం ఇక్కడ ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ, ఇరిగేషన్ టెండర్లలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం పాల్పడిన అవకతవకలను జనం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. పోలీసుల ద్వారా కాంగ్రెస్ నేతలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఇందిరాపార్కు నుంచి ధర్నా చౌక్‌ను తరలిస్తే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. ఇతర విపక్ష పార్టీలను కలుపుకుని కెసిఆర్ అనైతిక విధానాలపై పోరు సాగిస్తామన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ వారికి మంత్రి పదవులను ఇస్తున్న అక్రమ విధానాలకు చెక్‌పెట్టేందుకు త్వరలో రాష్టప్రతి, గవర్నర్‌ను కలవనున్నట్లు చెప్పారు. 2019 ఎన్నికల్లో టిక్కెట్లు కావాలనుకునే కాంగ్రెస్ నేతలు ఇప్పటి నుంచి పనిచేయాలని, ప్రజలతో మమేకం కావాలన్నారు.