తెలంగాణ

బాబర్‌కు మసీదు కట్టడమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 5: దేశంలో మరోసారి రామరాజ్యం రావాలని, దాంతోనే దేశాభివృద్ధి సాధ్యమవుతోందని విహెచ్‌పి అగ్రనేత ప్రవీణ్ తొగాడియా అన్నారు. శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం మధ్యాహ్నం హైద రాబాద్‌లో జరిగిన భారీ శోభాయాత్రలో ఆయన మాట్లాడుతూ అయోధ్యలో గత 70 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నా, ఆలయాన్ని నిర్మించలేకపోయామన్నారు. బాబర్ దోపిడిదారు అని, అతను విదేశీయుడని, ఆయనకు మన దేశంలో స్థానంలో లేదన్నారు. అయోధ్యలో తమ పోరాటం ఒక మం దిరం కోసం కాదని, రాముడి జన్మభూమి కోసమేనని ఆయన స్పష్టం చేశారు. అయోధ్యలో బాబర్ పేరు లేదని, అక్కడ మసీదు నిర్మించనివ్వమని స్పష్టం చేశారు. ప్రదాని చూసి పలు ముస్లిం దేశా లు కూడా ఆలయాల నిర్మాణానికి స్థలాలిస్తున్నాయని, అందుకే భారతదేశం బలపడితేనే ముస్లిం దేశాలు కూడా బలపడుతాయన్నారు. శ్రీశ్రీ శ్రీ కమలానంద భారతీస్వామి మాట్లాడుతూ దేశ, దైవభక్తి కల్గి ఉన్నవారే గొప్పవారవుతారన్నారు. సమాజంలో హిందూవుల గౌరవం పెరిగితేనే ముస్లిం, క్రైస్తవుల గౌరవం కూడా పెరుగుతుందన్నారు.
శ్రీరాముడు విగ్రహంతో బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన
శోభాయాత్ర. అధికసంఖ్యలో పాల్గొన్న భక్తులు. హిందూ సంస్థలు