తెలంగాణ

బడుగుల అభివృద్ధితో బంగారు తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 8: బడుగుల అభివృద్ధితోనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. ఈనెల జరగనున్న మహాత్మ జ్యోతిబాపూలే జయంతి సందర్భంగా రాష్టవ్య్రాప్తంగా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమానికి సంబంధించి ముద్రించిన ఆహ్వానపత్రాన్ని సచివాలయంలో శనివారం మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, విద్య మాత్రమే పేదలు, బడుగుబలహీన వర్గాల జీవితాలను మారుస్తుందని జ్యోతిబాపూలే, ఆయన భార్య సావిత్రిబాయి ధృడంగా విశ్వసించారని గుర్తు చేశారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసిల విద్యకోసం పూలే, సావిత్రిబాయి జీవితాంతం కృషి చేశారని గుర్తు చేశారు. పూలే ఆశయాల సాధన దిశగా, ప్రభుత్వం అనేక పథకాలు, కార్యక్రమాలు రూపొందించుకుని అమలు చేస్తోందన్నారు. బలహీన వర్గాల అభివృద్ధికోసం బడ్జెట్‌లో పెద్దపీఠ వేశామని గుర్తుచేశారు.