తెలంగాణ

కీచక గురువుకు చెప్పుదెబ్బలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ ఉప్పల్, ఏప్రిల్ 8: కూతురుగా భావించాల్సిన గురువే కీచకుడిగా మారి ఆమెపై అసభ్యకరంగా ప్రవర్తించాడు. సభ్య సమాజం సిగ్గుపడేలా వ్యవహరించిన స్కూల్ ప్రిన్సిపాల్‌పై విద్యార్థిని తల్లిదండ్రులు చెప్పులతో దాడి చేసిన సంఘటన ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. ఉప్పల్ భరత్‌నగర్‌లో ఉన్న జోషిస్ విద్యానికేతన్ స్కూల్‌లో 7వ తరగతి పూర్తిచేసుకుని 8వ తరగతికి వెళ్తున్న 12 ఏళ్ల దళిత బాలిక ఈనెల 6వ తేదీన స్కూల్ ఆవరణలో బాతురూంకు వెళ్లింది. అదే సమయంలో అక్కడే ఉన్న స్కూల్ ప్రిన్సిపాల్ నోముల నవీన్ ఒంటరిగా ఉన్న విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి ముద్దులు పెట్టే ప్రయత్నం చేయగా తప్పించుకుంది. ఆమె రెండు చేతులు పట్టుకుని ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేశాడు. మరుసటి రోజు శుక్రవారం యథా ప్రకారం స్కూల్‌కు వెళ్లింది. సాయంత్రం ఇంటికి వచ్చి ఎవరితో మాట్లాడకుండా వౌనంగా ఉండిపోయింది. ఏమి జరిగిందని తల్లి గట్టిగా అడిగితే స్కూల్‌లో జరిగిన తీరుపై వివరించింది. తల్లిదండ్రులు, స్థానికులతో కలిసి స్కూల్‌కు వెళ్లి ప్రిన్సిపాల్ నవీన్‌ను నిలదీసారు. అతడిని చెప్పులతో చితకబాది తదుపరి చర్యల కోసం పోలీసులకు అప్పగించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.

చిత్రం..కీచక గురువుకు చెప్పులతో దేహశుద్ధి చేస్తున్న విద్యార్థిని తల్లిదండ్రులు