తెలంగాణ

రామాలయం నిర్మాణంకోసం చావడానికైనా..చంపేందుకైనా సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 9: అయోధ్యలో రామాలయ నిర్మాణ అంశంపై గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ఆదివారం మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రామమందిర నిర్మాణం కోసం చావడానికైనా..ఇతరులను చంపేందుకైనా సిద్ధమేనని ప్రకటించారు. రామాలయ నిర్మాణాన్ని వ్యతిరేకించే వారి తల నరుకుతామంటూ ఆయన ఇటీవల కూడా ఓ సభలో హెచ్చరించారు. తన వాదనను ఆయన ఆదివారం ఓ సమావేశంలో కొనసాగిస్తూ, అయోధ్యలో రామాలయ నిర్మాణం జరిగితే గందరగోళం సృష్టిస్తామని, నిర్మాణాన్ని అడ్డుకుంటామని అంటున్న వారిని ఉద్దేశించే తాను మాట్లాడుతున్నానని అన్నారు. ‘రామాలయ నిర్మాణం కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా..తీయడానికైనా సిద్ధం, ఆలయ నిర్మాణానికి అడ్డుపడే వారికి ఇదే నా హెచ్చరిక’ అని ఆయన పునరుద్ఘాటించారు. అయోధ్యలో రామాలయం ఎప్పటినుంచో ఉందని, అక్కడే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉందని, లేకుంటే అయోధ్యలో తాము భవ్య మందిరాన్ని నిర్మించేవారమని ఆయన అన్నారు. ఇదిలావుండగా గోషామహల్ నియోజవర్గానికి ప్రాతినిధ్య వహిస్తున్న రాజాసింగ్ గతంలోనూ వివాదస్పద వ్యాఖ్యలు చేసి పలుమార్లు అరెస్టయ్యారు.