తెలంగాణ

కోలుకుంటున్న భరత సింహారెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 8: రోడ్డు ప్రమాదంలో గాయపడిన గద్వాల మాజీ ఎమ్మెల్యే డికె భరతసింహారెడ్డి కోలుకుంటున్నారని ఆయనకు చికిత్స చేస్తున్న అపోలో ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ఎడమ చేతికి తీవ్ర గాయం కావడంతో శనివారం శస్తచ్రికిత్స చేస్తున్నట్లు తెలిపారు. ఆర్ధోపెడిక్, న్యూరోఫిజీషియన్, హుద్రోగ నిపుణులు భరత సింహారెడ్డిని పరీక్షించారు. సిటీ స్కాన్, ఎంఆర్‌ఐతోపాటు పలు వైద్య పరీక్షలు కూడా నిర్వహించారని వెల్లడించారు. భగవంతుని దయ, కార్యకర్తల అభిమానంతో భరతసింహారెడ్డి బాగా కోలుకుంటున్నారని మాజీ మంత్రి డికె అరుణ చెప్పారు. కాంగ్రెస్ నేతలు మల్లు రవి, కూచుకుళ్ల దామోదరరెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచందర్ రెడ్డి, ఎంపి నంది ఎల్లయ్య ఇంకా పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు గురువారం అపోలో ఆసుపత్రికి చేరుకున్నారు.