తెలంగాణ
సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుమానాస్పద మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 20 June 2017
హైదరాబాద్, జూన్ 19: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఓ మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. బ్యాంక్ ఆఫ్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగినిగా పనిచేస్తున్న పద్మజ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. టెక్ మహీంద్రలో పనిచేస్తున్న గిరీశ్ నరసింహకు, పద్మజకు గత సంవత్సరం ఏప్రిల్ 20న వివాహమైంది. వీరిద్దరి మధ్య కొంతకాలంగా విభేదాలు తలెత్తాయి. వరకట్నం కోసం నరసింహ తమ కుమార్తెను తరచూ వేధిస్తుండేవాడని పద్మజ తల్లిదండ్రులు ఆరోపించారు. ఆదివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పద్మజ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు.