తెలంగాణ

కెసిఆర్‌ది అసత్య ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 19: ముస్లింల రిజర్వేషన్లకు ప్రధాని నరేంద్రమోదీ ఒప్పుకున్నారని సిఎం కెసిఆర్ చెప్పడం పచ్చి అబద్దమని బిజెపి నేత నాగం జనార్థన్‌రెడ్డి అన్నారు. కేవలం కెసిఆర్ అసత్య ప్రచారం చేసుకుని పబ్బం గడుపుకుంటున్నారని ధ్వజమెత్తారు. సోమవారం నాడిక్కడ వీరిద్దరు వేర్వేరుగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాజ్యాంగానికి, హైకోర్టునకు వ్యతిరేకంగా తెరాస ప్రభుత్వం మతపరమైన రిజర్వేషన్లు ప్రతిపాదిస్తోందని మండిపడ్డారు. లౌకికవాద దేశమైన భారత్‌లో మతపరమైన రిజర్వేషన్లను తమ పార్టీ ఎప్పుడూ సమర్ధించదని అన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే మతపరమైన రిజర్వేషన్లను తెరాస ప్రభుత్వం తెరపైకి తెచ్చిందని విమర్శించారు.
మైనార్టీ రిజర్వేషన్లు ఇస్తే సరేసరి, ఇవ్వకపోతే పోరాటం చేస్తామంటూ సిఎం కెసిఆర్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని నాగం అన్నారు. మియాపూర్ భూ కుంభకోణంలో ఒక్క గజం భూమి, ఒక్క పైసా పోలేదని సిఎం నిర్థారణకు ఎలా వచ్చారని ప్రశ్నించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న గోల్డ్‌స్టోన్ ప్రసాద్‌ను ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదని నిలదీశారు.