తెలంగాణ

హైదరాబాద్‌లో బిచ్చగాళ్ల కిడ్నాప్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 20: హైదరాబాద్‌లో బిచ్చగాళ్ల కిడ్నాప్ కలకలం రేపుతోంది. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఎల్‌బినగర్‌లో మంగళవారం తెల్లవారుజామున కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఓ వ్యాన్‌లో నలుగురు బిచ్చగాళ్లను బలవంతంగా ఎక్కించుకుని పరారైన సంఘటన కలకలం సృష్టించింది. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో నిద్రిస్తుండగా దుండగులు కిడ్నాప్‌కు పాల్పడ్డారు. కాగా కిడ్నాప్‌కు గురైన బిచ్చగాళ్లు సుమారు 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సుగలవారని తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు సమీపంలోని సిసికెమెరాల ఫుటేజీని సేకరించారు. వాటి ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు. కిడ్నాపైన వారిని మల్లయ్య, పెంటయ్య, వెంకటమ్మతోపాటు మరో మహిళగా గుర్తించారు.
కిడ్నాప్..కిడ్నీ మాఫియా పనేనా?
2014లో రాష్టవ్య్రాప్తంగా సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ మాఫియా మళ్లీ హైదరాబాద్‌లో ప్రవేశించిందా? బిచ్చగాళ్లను ఈ ముఠానే కిడ్నాప్ చేసిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2014లో హైదరాబాద్, నల్గొండ, మిర్యాలగూడ ప్రాంతాలకు చెందిన వారి కిడ్నీలు సేకరించి అమ్మినట్టు వచ్చిన వార్తలు అప్పట్లో సంచలనం రేపాయి.
అయితే కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న ఈ కిడ్నీ మాఫియా మళ్లీ కిడ్నీ వ్యాపారానికి తెగబడిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ముఠా కొందరు అమాయకుల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని ఎంతోకొంత ముట్టజెప్పి కిడ్నీలు తీసుకుంటుంది..అవసరమున్న వారికి పెద్దమొత్తంలో అమ్ముతుంది. కాగా అప్పట్లో రాష్ట్రప్రభుత్వం దీనిని తీవ్ర నేరంగా పరిగణిస్తూ కొందరిని అరెస్టు చేసింది. కిడ్నీ రాకెట్ గుట్టు రట్టుచేసింది. ప్రస్తుతం తాజాగా హైదరాబాద్ ఎల్బీనగర్‌లో కలకలం రేపుతున్న బిచ్చగాళ్ల కిడ్నాప్, గతంలోని కిడ్నీ మాఫియాతో ఏమైనా సంబంధాలున్నాయా? అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నట్టు తెలిసింది.