తెలంగాణ

విచారణ అధికారిగా ఆర్‌సిపురం డిఎస్పీ సీతారాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, జూన్ 22: దొంగతనం కేసులో జహీరాబాద్ టౌన్ పోలీసుల అదుపులో ఉన్న నింధితుడు అనుమనాస్పదంగా మృతి చెందిన కేసుపై జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అధికారి చంద్రశేఖర్‌రెడ్డి రామచంద్రాపూర్ డిఎస్‌పి సీతారాంను విచారణ అధికారిగా నియమించినట్లు పేర్కొన్నారు. కేసుకు సంబంధించిన వివరాలను ఈ విధంగా వెల్లడించారు.
ఈ సంఘటనను కస్టోడియల్ డెత్ గా క్రైం నంబర్ 147/2017 యు,ఎస్ 176గా కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. ఈ కేసు విచారణ అధికారిగా రామచంద్రాపూర్ డిఎస్పీ సీతారాంను నియమించినట్లు స్పష్టం చేసారు. ఈ కేసులో ఎన్‌హెచ్‌ఆర్‌సి సూచనల మేరకు జహీరాబాద్ ఆర్డీవో శవ పంచనామ నిర్వహించారని, డాక్టర్ల బృం దం పోస్టుమార్టం నిర్వహించారని అన్నారు. శవ పంచనామా, పోస్టుమార్టంను వీడియో రికార్డు కూడా చేసారని ఎస్పీ వెల్లడించారు.