తెలంగాణ

శిరీష కేసులో మరో మలుపు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 24: రాష్టవ్య్రాప్తంగా సంచలనం సృష్టించిన బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో రాజీవ్, శ్రవణ్‌లను మళ్లీ రెండురోజుల పోలీస్ కస్టడీకి అప్పగించాలని పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు శనివారం నిందితులు శ్రవణ్, రాజీవ్‌లను పోలీసు కస్టడీకి అనుమతిచ్చింది. ఈనెల 27న వీరిని కస్టడీకి తీసుకుని విచారించనున్నట్టు బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు. గతంలో రాజీవ్, శ్రవణ్‌లను ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో శిరీష ఆత్మహత్యపై అనేక అనుమానాలు నివృత్తి కోసం మరో 2రోజులు శ్రవణ్, రాజీవ్‌లను కస్టడీకి ఇవ్వాలని పోలీసుల కోర్టును ఆశ్రయించారు.