తెలంగాణ
ఢిల్లీలో వైభవంగా బోనాల సంబురం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
న్యూఢిల్లీ, జూన్ 26: దేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్లో బోనాల సంబురాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ పాతబస్తీ లాల్దర్వాజాలోని చారిత్రక సింహవాహిని శ్రీ మహంకాళీ ఆలయం కమిటీ, ఢిల్లీలోని ఆంధ్రా, తెలుగు అసోసియేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు ఇండియాగేట్ నుంచి బోనాల ఊరేగింపును తెలంగాణ ప్రభుత్వ విప్, శాసన మండలి సభ్యుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కర్నె ప్రభాకర్ ప్రారంభించారు. మహిళలు బోనాలను ఎత్తుకొని ఇండియా గేట్నుంచి తెలంగాణ భవన్వరకు ఊరేగింపు నిర్వహించారు. పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, ఒగ్గు డోలు దరువులతో ఉత్సాహంగా ఊరేగింపు కొనసాగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ భవన్ అధికారులు వేదాంతం గిరి, రాంమోహన్, సింహవాహిని తదితరులు పాల్గొన్నారు. ఈ ఉత్సవాలు మంగళవారం కూడ జరగనున్నాయి.