తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో ముగ్గురి దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/కెపిహెచ్‌బికాలనీ, జూలై 2: అతివేగం ముగ్గురి ప్రాణాలు బలి తీసుకుంది. బోనాల సందర్భంగా అమ్మవారి దర్శనానికి వెళ్తుండగా ముగ్గురు కుటుంబ సభ్యులు అమ్మవారి దర్శనం చేసుకోకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్లపోయారు. పటాన్‌చెరు మండలం రామచంద్రాపురం చెందిన నర్సింహులు, లలిత దంపతుల కుమార్తె శిరీషతో కలసి ముగ్గురు ద్విచక్రవాహనంపై నగరంలోని బల్కంపేట ఎల్మమ్మ తల్లి దర్శనానికి బయలుదేరారు. ఆదివారం ఉదయం కూకట్‌పల్లిలోని వివేకానంద నగర్ వద్దకు రాగానే సిమెంట్ లోడ్‌తో వెళ్తున్న లారీ అతి వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో నర్సింహులు దంపతులతోపాటు వారి కుమార్తె శిరీష అక్కడిక్కడే మృతి చెందారు. ముందు వైపు వెళ్తున్న స్కూటీని లారీ వెనక నుంచి అతివేగంగా ఢీకొట్టడంతో ముగ్గురు ఎగిరిపడ్డారు. వారిపై నుంచి లారీ చక్రాలు వెళ్లడంతో అక్కడిక్కడే ప్రాణాలు వదిలారు. లారీ డ్రైవర్ బ్రేకులు వేసినప్పటికీ 10 మీటర్ల వరకు వెళ్లి లారీ ఆగిపోయింది. సడన్ బ్రేక్ వల్ల లారీ వెనుక వున్న మరో ద్విచక్రవాహనదారుడు మత్స్యగిరి గాయపడ్డాడు. పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు.