తెలంగాణ
రాష్ట్రానికి 2600 కోట్లు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 5 July 2017
హైదరాబాద్, జూలై 4: ఖరీఫ్ సీజన్లో రైతులకోసం బ్యాంకుల్లో నగదు అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. ఆర్బిఐ మంగళవారం నాడు తెలంగాణకు 2600కోట్ల రూపాయలు విడుదల చేసింది. సాధారణంగా జూలై 1న 1700 కోట్లు విడుదల చేయాల్సి ఉండగా అదనంగా 900 కోట్ల రూపాయలు విడుదల చేసింది. పూర్వపు ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాలకు 150 నుండి 200 కోట్లు చొప్పున ఆర్బిఐ విడుదల చేసింది. హైదరాబాద్, మెదక్ జిల్లాలకు 300 కోట్లు విడుదల చేసింది. ఆర్బిఐని దత్తాత్రేయ అభినందించారు.