తెలంగాణ

కేంద్రం భయంతోనే కోవింద్‌కు టిఆర్‌ఎస్ మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 6: రాష్ట్రప్రభుత్వం పాల్పడిన అవకతవకలపై కేంద్రం సిబిఐ విచారణకు ఆదేశిస్తుందనే భయంతోనే ఎన్డీఏ ప్రభుత్వం నిలబెట్టిన రాష్టప్రతి అభ్యర్ధి కోవింద్‌కు టిఆర్‌ఎస్ పార్టీ మద్దతు ఇచ్చిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ విమర్శించారు. గురువారం ఆయన ఇక్కడ విలేఖర్లతో మాట్లాడుతూ టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేల్లో చాలా మంది యుపిఏ అభ్యర్ధి మీరాకుమార్‌కు ఓటు వేసేందుకు మొగ్గు చూపుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భానికి స్పీకర్‌గా మీరాకుమార్ విశేషమైన కృషి చేశారన్నారు. ఈ విషయాన్ని దృష్టిలోపెట్టుకుని టిఆర్‌ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు యుపిఏ అభ్యర్ధికి ఓటు వేయాలన్నారు.
వైఎస్‌ఆర్ జయంతిని బహిష్కరించండి: విహెచ్
ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీని వైకాపా నేత భూమన కరుణాకరరెడ్డి రాక్షసిగా విమర్శించడాన్ని కాంగ్రెస్ మాజీ ఎంపి వి హనుమంతరావు తప్పుబట్టారు. వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని కాంగ్రెస్ కార్యకర్తలు బహిష్కరించాలన్నారు. తన వ్యాఖ్యలపై భూమన వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు. జగన్‌ను కాంగ్రెస్ పార్టీ సిబిఐ కేసుల్లో ఇరికించిందని చెప్పడం తగదన్నారు.