తెలంగాణ

ఏకీకృత విధానం రూపొందించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 7: రాష్ట్రంలో వేస్ట్ మేనేజ్‌మెంట్ రంగంలో ఏకీకృత విధానాన్ని అవలంభించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కె. తారక రామారావు మున్సిపల్ వ్యవహారాల శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మంత్రి కెటిఆర్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెత్త నిర్వహణ ప్రాజెక్టులపై సమీక్షించారు. చెత్త నిర్వహణ అనేది కొంత ఖర్చుతో కూడుకున్న అంశం అయినప్పటికీ స్వచ్ఛమైన నగరాల కోసం ప్రభుత్వం బాధ్యత ఎత్తుకుంటున్నదని అన్నారు.
అయితే ఇందు కోసం ఏకీకృత విధానాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. స్ట్ఫా కాలేజ్ (అస్కీ), సహాకారంతో మార్గదర్శకాలు రూపొందించాలన్నారు. చెత్త నిర్వహణలో భాగంగా హైదరాబాద్‌లోని జవహార్‌నగర్ ప్లాంట్ వద్ద ఉన్న వ్యర్థాలకు గ్రీనణ క్యాపింగ్ చేయనున్నట్లు ఆయన చెప్పారు. దీంతో అక్కడి జలాలు కలుషితం అయ్యే అవకాశం తగ్గుతుందన్నారు. దీంతో పాటు పరిసర అపాంతాల్లో ప్రజలకు దుర్వాసన పోతుందని ఆయన తెలిపారు. ఈ గ్రీన్ క్యాపింగ్ కోసం మొత్తం 1.46 కోట్లతో పనులు ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఈ సంవత్సరం హరితహారంలో మెడిసినల్ మొక్కలు, సువాసనలు వెదజల్లే చెట్లు నాటుతామని తెలిపారు.
జవహార్‌నగర్ డంప్ యార్డ్ వద్ద ఉన్న వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్ చేస్తామని, దీని ద్వారా చెత్త నుంచి వచ్చే కలుషిత జలాలను అక్కడిక్కడే శుద్ధి చేసేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. హైదరాబాద్ నగర పరిథిలోని నాలుగు వేస్ట్ టూ ఎనర్జీ కంపెనీల ప్రతిపాదనలు ఏమిటని, ఎప్పటిలోగా ప్రారంభం అవుతుందనే అంశాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. కరీంనగర్, సూర్యాపేట జిల్లాలో ఉన్న కంపెనీల మూసివేతకు దారి తీసిన కారణాలు, వాటి పునఃప్రారంభానికి ఉన్న అవకాశాల గురించి వాటి యాజమానులతో మాట్లాడారు. ప్రభుత్వ పరంగా కాంట్రాక్కు ఒప్పందంలో పేర్కొన్న నిబంధనలకు తాము కట్టుబడి ఉంటామని, ఆ మేరకు ఆయా ప్లాంట్లకు చెత్తను సరఫరా చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో జిహెచ్‌ఎంసి మేయర్ బొంతు రాంమోహన్, మున్సిపల్ వ్యవహారాల శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్థన్ రెడ్డి, ఆస్కీ ప్రతినిధులు, మున్సిపల్ శాఖాధికారులు పాల్గొన్నారు.

చిత్రం.. శుక్రవారం హైదరాబాద్‌లో మున్సిపల్ అధికారులతో సమీక్షిస్తున్న మంత్రి కెటిఆర్