తెలంగాణ

కాశ్మీర్ ప్రమాదంలో కామారెడ్డి వాసి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 7: జమ్మూ-కాశ్మీర్, అనంతనాగ్, కాజిగుండా ప్రాంతంలో ఓ పర్యాటక బస్సులో సిలెండర్ పేలుడుతో కామారెడ్డి జిల్లాకు చెందిన వ్యక్తి మృతి చెందడం, పలువురు తీవ్రంగా గాయపడడం పట్ల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం కాశ్మీర్ ప్రధాన కార్యదర్శికి ఓ లేఖ రాశారు. మృతి చెందిన వ్యక్తి భౌతికకాయాన్ని వెంటనే విమానం ద్వారా పంపించేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆయన కోరారు. సిలెండర్ పేలిన సమయంలో బస్సులో 47 మంది ఉన్నారని, వారిలో పలువురు తీవ్రంగా గాయపడ్డారని, మరి కొంత మందికి స్వల్ప గాయాలయ్యాయని సమాచారం అందినట్లు ఆయన తెలిపారు. కాబట్టి దీనిని చాలా అత్యవసరంగా పరిగణించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన కోరారు.