తెలంగాణ
కెటిఆర్, తలసానిపై కేసు వెనక్కి తీసుకోను
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 9 July 2017
హైదరాబాద్, జూలై 8: అమాయక ప్రజలను మాయ మాటలతో మోసం చేస్తున్న రాష్ట్ర మంత్రులు కె. తారక రామారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్పై లోగడ పెట్టిన ఛీటింగ్ కేసును వెనక్కి తీసుకోనని టి.కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి తెలిరు. సనత్నగర్లో వక్ఫ్ భూముల్లో ఇండ్లు కట్టుకున్న వారిని ఖాళీ చేయాలని జిహెచ్ఎంసి తెల్ల కాగితంపై నోటీసులు ఇచ్చిందని ఆయన శనివారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. ఆ భూముల్లో పేదలను ఖాళీ చేయించి మంత్రులు కబ్జా చేయాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. అంబేద్కర్ నగర్లో డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మిస్తామని చెప్పి 70 శాతం ఇండ్లు ఖాళీ చేయించారని, ఇప్పుడు అక్కడ నిమజ్జనం కోసం చెరువు నిర్మించాలని యత్నించడం ప్రజలను మోసం చేయడమేనని ఆయన తెలిపారు.