తెలంగాణ
‘సెస్ పేరిట ఏటా రూ.20 కోట్లు వసూలు’
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 10 July 2017
హైదరాబాద్, జూలై 9: రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ల కోసం కాంట్రాక్టర్లతో కుమ్మక్కైందని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు పేరాల శేఖర్ రావు విమర్శించారు. ఆర్టిసి ప్రయాణికులకు సౌకర్యాల పేరిట ఈ మూడేళ్ళలో సుమారు 60 కోట్ల ప్రయాణికుల సొమ్మును దారి మళ్ళించిందని ఆయన దుయ్యబట్టారు. ఆదివారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో జరిగిన పార్టీ జిల్లా ఆర్టిఐ విభాగాల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పేరాల శేఖర్ రావు ప్రసంగిస్తూ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్లో ఆర్టీసీ బస్సులో ప్రయాణించే ప్రతి ప్రయాణికుడి నుంచి ‘అభివృద్ధి సెస్’ పేరిట ఒక్క రూపాయి వసూలు చేయగా, తెలంగాణ ప్రభుత్వం దానిని ఇంకా కొనసాగిస్తున్నదని తెలిపారు.